షితాబుఖాన్ అనబడే చిత్తాపుఖాన్
షితాబుఖాన్ ను చిత్తాపుఖాన్ అని పిలిచేవారు. షితాబుఖాన్ మొదటిపేరు సీతాపతిరాజు. పసులమందలను కాచే బోయకులంలో పుట్టినవాడు.బహమనీ సుల్తాన్ హుమాయూన్ షా సైన్యంలో కాల్బంటుగా పనిచేసాడు. పెద్దస్థాయి సైనికాధికారిగా ఎదిగాడు. షితాబుఖాన్ అనే పేరుతో సొంతజాగీరును ఏర్పరుచుకున్నాడు. షితాబుఖాన్ అనే పేరును హోదాకోసమే వాడుకున్నాడో లేక ముస్లింగా మారాడో తెలియదు.
‘తారిఖ్ ఇ ముహమ్మద్ ఖుతుబ్షాహి’లో షితాబుఖాన్ నిర్భయయోధుడైన ఖమ్మంమెట్టు రాజుగా వర్ణించబడ్డాడు. బ్రిగ్స్ అనే చరిత్రకారుడు ‘హిస్టరీ ఆఫ్ ది రైజ్ ది ముహమ్మడన్ పవర్ ఇన్ ఇండియా’ లో షితాబుఖాన్ ను హిందువైన సీతాపతిగా రాస్తాడు. వరంగల్లులోని 1503నాటి శాసనంలో షితాబుఖాన్ వంశక్రమం వివరించబడ్డది. షితాబుఖాన్ వరంగల్, ఖమ్మం, నల్లగొండల పాలకుడుగా వుండేవాడు.
బహమనీల మీద దండయాత్ర అనంతరం గోల్కొండకు తిరిగివచ్చిన సుల్తాన్ఇబ్రహింకు షితాబుఖాన్ కుతుబ్షా రాజ్యాన్ని ఆక్రమించజూస్తున్నాడని ఫిర్యాదులొచ్చాయి. ప్రతిఘటించకుండానే వరంగల్ సుల్తాన్ స్వాధీనమైంది. హిందూపాలకుల సంఘటనను కూడగట్టుకునే లోపల మళ్ళీ సుల్తాన్ దాడి. ఆ రాజులు షితాబుఖానుకు ఎంత మద్దతిచ్చినా ఫలితం లేకపోయింది.
క్రీ.శ. 1480 నుంచి 1485వరకు షితాబుఖాన్ రాచకొండ గవర్నర్ గా వుండేవాడు. బహమనీరాజ్యంలోని అంతఃకలహాలను తనకనుకూలం చేసుకొన్న షితాబుఖాన్ క్రీ.శ. 1503లో స్వతంత్రపాలకుడయ్యాడు. 1503 నుంచి 1512దాకా రాచకొండ, వరంగల్, ఖమ్మం కోటలనుంచి పాలన సాగించాడు. చెరువులను తవ్వించడం, పాకాల చెరువును బాగుచేయించడం వంటి ప్రజాహిత కార్యాలను చేసాడు.
16*38*12 మీ.ల కొలతలతో ఇండో సారసెనిక్ శైలిలో వరంగల్ కోటకు పడుమట నిర్మించబడ్డది ఖుషమహల్ సౌధం. షితాబుఖాన్ కొలువులోని ప్రధానమంత్రి ఎనుములపల్లి పెద్దనమంత్రి చరిగొండ ధర్మన్న రాసిన ‘‘చిత్రభారతాన్ని’’ అంకితం గొన్నవాడు. ఇందులో షితాబుఖాన్ పరిపాలన గురించి చాలా గొప్పగా వర్ణించబడ్డది.
కులీ కుతుబ్షా షితాబుఖాన్ మీద చాలాసార్లు దండెత్తాడు. ఎన్నిసార్లు యుద్దం చేసినా కొన్నిసార్లు గెలుపు, కొన్నిసార్లు ఓటములతో షితాబుఖాన్ సతమతమయ్యాడు. 1512 తర్వాత కళింగ రాజైన ప్రతాపరుద్రగజపతి సేవలో చేరాడు. కృష్ణదేవరాయలు గజపతులమీద దండెత్తినపుడు రాయల్ని సింహాద్రి వద్ద (విశాఖ జిల్లా) విలుకాండ్రసైన్యంతో నిలువరించాడట. కాని, గెలుపు రాయల వశమైంది. ఆ యుద్ధంలోనే షితాబుఖాన్ మరణించివుంటాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.
ఈ షితాబుఖాన్ 1503లో శాయంపేటలోని పాంచాలరాయస్వామి దేవాలయాన్ని పునరుద్ధరించాడని శాసనంలో వుంది.
‘తారిఖ్ ఇ ముహమ్మద్ ఖుతుబ్షాహి’లో షితాబుఖాన్ నిర్భయయోధుడైన ఖమ్మంమెట్టు రాజుగా వర్ణించబడ్డాడు. బ్రిగ్స్ అనే చరిత్రకారుడు ‘హిస్టరీ ఆఫ్ ది రైజ్ ది ముహమ్మడన్ పవర్ ఇన్ ఇండియా’ లో షితాబుఖాన్ ను హిందువైన సీతాపతిగా రాస్తాడు. వరంగల్లులోని 1503నాటి శాసనంలో షితాబుఖాన్ వంశక్రమం వివరించబడ్డది. షితాబుఖాన్ వరంగల్, ఖమ్మం, నల్లగొండల పాలకుడుగా వుండేవాడు.
బహమనీల మీద దండయాత్ర అనంతరం గోల్కొండకు తిరిగివచ్చిన సుల్తాన్ఇబ్రహింకు షితాబుఖాన్ కుతుబ్షా రాజ్యాన్ని ఆక్రమించజూస్తున్నాడని ఫిర్యాదులొచ్చాయి. ప్రతిఘటించకుండానే వరంగల్ సుల్తాన్ స్వాధీనమైంది. హిందూపాలకుల సంఘటనను కూడగట్టుకునే లోపల మళ్ళీ సుల్తాన్ దాడి. ఆ రాజులు షితాబుఖానుకు ఎంత మద్దతిచ్చినా ఫలితం లేకపోయింది.
క్రీ.శ. 1480 నుంచి 1485వరకు షితాబుఖాన్ రాచకొండ గవర్నర్ గా వుండేవాడు. బహమనీరాజ్యంలోని అంతఃకలహాలను తనకనుకూలం చేసుకొన్న షితాబుఖాన్ క్రీ.శ. 1503లో స్వతంత్రపాలకుడయ్యాడు. 1503 నుంచి 1512దాకా రాచకొండ, వరంగల్, ఖమ్మం కోటలనుంచి పాలన సాగించాడు. చెరువులను తవ్వించడం, పాకాల చెరువును బాగుచేయించడం వంటి ప్రజాహిత కార్యాలను చేసాడు.
16*38*12 మీ.ల కొలతలతో ఇండో సారసెనిక్ శైలిలో వరంగల్ కోటకు పడుమట నిర్మించబడ్డది ఖుషమహల్ సౌధం. షితాబుఖాన్ కొలువులోని ప్రధానమంత్రి ఎనుములపల్లి పెద్దనమంత్రి చరిగొండ ధర్మన్న రాసిన ‘‘చిత్రభారతాన్ని’’ అంకితం గొన్నవాడు. ఇందులో షితాబుఖాన్ పరిపాలన గురించి చాలా గొప్పగా వర్ణించబడ్డది.
కులీ కుతుబ్షా షితాబుఖాన్ మీద చాలాసార్లు దండెత్తాడు. ఎన్నిసార్లు యుద్దం చేసినా కొన్నిసార్లు గెలుపు, కొన్నిసార్లు ఓటములతో షితాబుఖాన్ సతమతమయ్యాడు. 1512 తర్వాత కళింగ రాజైన ప్రతాపరుద్రగజపతి సేవలో చేరాడు. కృష్ణదేవరాయలు గజపతులమీద దండెత్తినపుడు రాయల్ని సింహాద్రి వద్ద (విశాఖ జిల్లా) విలుకాండ్రసైన్యంతో నిలువరించాడట. కాని, గెలుపు రాయల వశమైంది. ఆ యుద్ధంలోనే షితాబుఖాన్ మరణించివుంటాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.
ఈ షితాబుఖాన్ 1503లో శాయంపేటలోని పాంచాలరాయస్వామి దేవాలయాన్ని పునరుద్ధరించాడని శాసనంలో వుంది.