విశ్వబ్రాహ్మణదొరల గడి గట్లమల్యాలః
గట్లమల్యాల గ్రామ నిర్మాత సీతారామారావు
వారి
వంశావళి
సీతారామారావు
I
రాంకిషన్
రావు
I
సత్యనారాయణరావు
I I
I
I I
రాంకిషన్ రావు యాదగిరిరావు వేంకటేశ్వరరావు సరోజన విజయలక్ష్మి
I I I
I I ------------------------------------------------------------
I --------------------------------------------------------- I
I I I I I I
----------------------------------- సుజాత ఇందిర రమేశ్ మంజుల ఉమేశ్ I
I I I I
శ్రీనివాసరావు ఉమాదేవి వెంకట్రాంరావు I
I
------------------------------------------------------------
I I I
మాధవీలత ప్రదీప్ కుమార్ చింటు(USA)
గట్ల
మల్యాల గ్రామస్థాపకుడు సీతారామారావు. గట్లమల్యాల సిద్ధిపేట నుంచి హుస్నాబాద్ పోయే
తొవ్వలో వుంది. ఇక్కడవున్న గడీని దొరలమల్యాలగడి, గట్ల మల్యాలగడి అని పిలుస్తారు.
విశ్వబ్రాహ్మణులలో
కంసాలులు, అవుసలివాండ్లు, స్వర్ణకారులని పిలువబడే కులంవారి దొరతనపు గడి
గట్లమల్యాల. అందుకే ఈ గడిని అవుసులోల్ల గడి అని అంటారు. వృత్తి కళాకారులైన వీరికి
దొరతనం దక్కడం,గడి నిర్మాణం చేసుకోవడం తెలంగాణలో మరెక్కడా కనిపించదు. నంగునూరు
మండలంలోని ఈ గ్రామంలో గడి 6ఎకరాలలో విస్తరించివుంది. ఈ గడిని నిర్మాణం చేయించింది
కత్తూరిపల్లి సత్యనారాయణ.
నిజాంరాజు
కొన్ని ప్రాంతాలను హర్రాస్(వేలం) ద్వారా తనకు నచ్చినవాళ్ళకు ఇచ్చాడు. వాళ్ళను
హర్రాస్ దార్ లని పిలుస్తారు. హర్రాస్ ద్వారా దక్కిన భూభాగాలకు హర్రాస్ దార్లు
పన్ను,కప్పం కట్టనవసరంలేదు. అది ఈ వృత్తి కళాకారులకు ఇచ్చిన గౌరవం.అంతేకాదు నిజాం
తన కొలువులో వీరికి కుడివైపు ఆసనాలిచ్చి గౌరవించేవాడట. వీరికి రావుబహద్దూరు
బిరుదులిచ్చి వుండవచ్చుననిపిస్తుంది. గట్లమల్యాలలోని రాళ్ళతో నిండిన భూములను
సేద్యయోగ్యం చేయించి గ్రామాన్ని అభివృద్ధి
చేసారు విశ్వబ్రాహ్మణదొరలు. దాదాపు 400 ఎకరాలకు పైననే వ్యవసాయయోగ్యభూములను
సిద్ధపరిచారు.యాభై నాగండ్లతో పొలాలు దున్నించేవారట. మొత్తం పొలాలన్నీ వారి స్వాధీనంలోనే
వుండేవి.
సత్యనారాయణరావుకు
ముగ్గురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. కొడుకులు రాంకిషన్ రావు(రామకృష్ణ),
యాదగిరిరావు, వేంకటేశ్వర్ రావులు
ముగ్గురికి మూడు గడీలు కట్టించాడు సత్యనారాయణరావు. వాటిని పెద్దదొరగడి,
నడిపిదొరగడి, చిన్నదొరగడి అని పిలుస్తారు ఇక్కడి ప్రజలు. పెద్దదొర గడి
మట్టి,గూనపెంకులతో వుండగా, మిగతా యిద్దరిగడీలు డంగుసున్నంతో అలంకరణలతో
కట్టించబడ్డాయి. గడిలో ప్రధానద్వారం వద్ద చౌకీదారుకు గది, దాస,దాసీలకు కూడా
ప్రత్యేకమైన గదులు కట్టించారు.
పెద్దదొరగడి 5భాగాలుగా
కట్టబడింది.గూనపెంకల కప్పుతో వుంది. నడిపిదొరగడికి పెద్దదర్వాజ వుంది. దానిపక్కన మైసమ్మగుడి
వుంది. ఈయనకు గుర్రాలంటే ఇష్టం. గుర్రపుశాలలు నిర్మింపజేసారు. ధాన్యపు గరిసెలు
కూడా వాటి పక్కనే వున్నాయి. చిన్నదొరగడి ప్రధానద్వారం పక్కనే వుంది ఈ గడి. అందమైన
పూలతీగెల డిజైన్లతో గోడలు అలంకరించబడ్డాయి.
నడిపిదొర యాదగిరిరావు గట్లమల్యాల సర్పంచ్ గా పనిచేసాడు.
కో ఆపరేటివ్ బ్యాంకు చైర్ పర్సన్ గా వున్నాడు. నాగసముద్రం నుంచి వూరికి 11 కి.మీ.ల
రోడ్డు వేయించాడట.
ఈ
దొరలు గ్రామంలో పాఠశాల నిర్మాణానికి 2న్నర ఎకరాలు డొనేట్ చేసారు. గ్రామాభివృద్ధికి
కావలసిన సహకారాన్నందజేస్తున్నారు యిప్పటికీ.
గట్లమల్యాల
ప్రజలు బంగారం పనిచేసే స్వర్ణకారుల దొరతనపు పాలన బంగారమేనంటున్నారు.
అయితే ఈ దొరల వంశమూలాలు హైద్రాబాద్
లోనే ఉన్నాయంటున్నారు హైద్రాబాద్ లోని
కత్తూరిపల్లివారు. అదిమరొక అన్వేషణ.
కొసమెరుపుః గట్లమల్యాల గ్రామంలో ఎక్కడ
చూసిన రాళ్ళు కనిపిస్తాయి. పొలాల్లో మెన్హర్లు కనిపించాయి. మెగాలిథిక్ సమాధుల
ఆనవాళ్ళు కనిపించాయి. కొత్తరాతియుగపు రాతిపనిముట్లు కనిపించాయి.
No comments:
Post a Comment