భారత ఉపఖండంలో కుండల తయారీః
భారతీయకళల్లో కుండల పరిశ్రమ పురాతన చరిత్ర కలిగివుంది. ప్రాకృతికమైన, ఐకానిక్ మూలాల కళ ఇది. మెహర్ఘర్ లో తొలి స్థిరనివాసాలనాటి కుండలు ఇండస్ లోయ నాగరికతలో దొరికాయి. ఈ సాంస్కృతిక కళ భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్ లలో విస్తరించింది.ఇప్పటిదాకా కూడా భారతీయ కుండల పరిశ్రమ టెర్రకోటతో సహా మట్టితో చేసినదే.
కొన్నిహిందూ సంప్రదాయాలు మట్టిపాత్రల్లో తినడాన్ని నిరుత్సాహ పరిచాయి. విలాసవంతమైన వాటిమీద మోజు పెంచుకోవడంవల్ల మట్టిపాత్రల పాత్ర తరిగిపోయింది. మట్టి కాగులు, బానలు, పెద్దకుండలు నీటినిలువలకు వాడబడేయి. చిన్న,చిన్న దీపంతలు, గురుగులు, పానపాత్రలు, కొన్ని వాడుకుని పారేసేవి....ఇట్లా ఎన్నో రకాలు. ఈ ఉపఖండంలో టెర్రకోట బొమ్మలు, పాత్రలు, మట్టితో చేసిన అనేకపాత్రలు సాంప్రదాయిక నిర్మాణకళతో మమేకం అయ్యాయి. గుళ్ళు, మసీదులు చెక్కిన ఇటుకలు, టెర్రకోట డిజైన్లతో నిర్మాణమైనాయి కొన్ని. దక్షిణ భారతదేశంలోని గుడుల గోపురాలలో సాధారణంగా రంగులువేసిన టెర్రకోటబొమ్మలతో అలంకరించబడివున్నాయి.
ఈ ఉపఖండంలో కుండల తయారీకి కుంభారులు, కుమ్మరుల జాతి, కులం వారే వృత్తి కళాకారులు.
కుండల చరిత్రః కుండల తయారీని బట్టి ప్రాంతాల వారీగా వేర్వేరు సంస్కృతులకు చెందినవని చెప్తారు.
సోథి-సిస్వాల్ సంస్కృతిః
సింధూ లోయ నాగరికత కన్న ముందటి ,అంటే క్రీ.పూ.4600ల నాటి సంస్కృతి ఇది. గార్గే తేజా ప్రకారం సోథీ సంస్కృతి సిస్వాల్ సంస్కృతి కన్నా ముందరిది. 165ప్రదేశాలలో దొరికిన నివేదికలున్నాయి. సోథీ-సిస్వాల్ ల మధ్య పోలికలు చాలా వున్నాయి.కోట్ డిజి సెరామిక్స్ సంస్కృతి సోథీ-సిస్వాల్ సంస్కృతులకు వాయవ్యంలో, రాజస్థాన్ లో ఆగ్నేయంలో వుంది.
ఆహార్ బాణాస్ సంస్కృతిః
ఈ సంస్కృతి చాల్కోలిథిక్ పురావస్తు సంస్కృతి. రాజస్థాన్ లోని ఆహార్ నది ఒడ్డున ఈ సంస్కృతి వుంది. క్రీ.పూ.3వేల నుంచి 15వందల సం.రాలలో సింధూలోయ నాగరికతకు పొరుగున, సమకాలీనంగా వున్నది. ఆహార్ బాణాస్ ప్రజలు ఆరావళిపర్వతాలశ్రేణి నుంచి రాగి ఖనిజాన్ని సంగ్రహించి గొడ్డండ్లు, పనిముట్లు చేసుకునేవారు.గోధుమ,బార్లీ పంటలు పండించేవారు.
సింధూలోయ నాగరికత సంస్కృతిః
హరప్పాదశ సింధూలోయ నాగరికత సంబంధించి క్రీ.పూ.2500-1900 నాటి పాత్రలభించింది. భారతదేశంలో కొత్తరాతియుగానికన్నా ముందే ఈ కుండల సంస్కృతి వుంది. చేతితో చేసినవి గిన్నెలు, పెద్దకుండలు, పాత్రలు ఎరుపు, నారింజ, గోదుమ, నలుపు, క్రీం వంటి అనేక రంగుల్లో వున్నాయి. అంతేగాక సింధూలోయ నాగరికతలో రెండురకాల కుండలు చేతితో చేసినవి, కుమ్మరిచక్రంమీద చేసినవి వున్నాయి.
రంగపూర్ సంస్కృతిః
సౌరాష్ట్రద్వీపకల్పంలో వానాల దగ్గర ఖంభత్, కఛ్ శాఖల్లో రంగపూర్ సంస్కృతి వుంది. లోథాల్ లో వాయవ్యభాగంలో పెద్దభాగంలో విస్తరించివుంది. ఏఎస్సై వారు 1931,1947,1956లలో ఇక్కడ తవ్వకాలు జరిపారు. నాలుగు కాలాలకు చెందిన మధ్యరాతియుగం, సూక్ష్మరాతియుగం రాతిపనిముట్లు, సింధూలోయ నాగరికతలోని మూడుదశల వస్తువుల్లో కుండలు దొరికాయి.
1. కుండలతో కూడిన సూక్ష్మరాతిపరికరాలు:క్రీ.పూ.3000సం.లు
2. హరప్పా దశః క్రీ.పూ.2000-1500సం.లు
1.పూర్వ హరప్పా: క్రీ.పూ.1500-1100 సం.లు
2.హరప్పా సంధిదశ: క్రీ.పూ.1100-1000 సం.లు
3. గొప్పనైన ఎరుపురంగు కుండల దశ.క్రీ.పూ. 1000-800 సం.లు
ఝూకర్, ఝంగర్ సంస్కృతి:
కంచులోహయుగం తర్వాతిది. సింధ్ ప్రాంతంలో వున్న సంస్కృతి అది. క్రీ.పూ. 2వేలల్లో సింధ్ లోని ఝూకర్ లో బయటపడ్డ ఈ సంస్కృతి హరప్పా సంస్కృతి అనంతరదశ. కొంత పట్టణ నాగరికతాప్రభావమున్నది.దీనిని అనుసరించిందే ఝంగర్ దశ. ఇది పట్టణసంస్కృతి కాదు.క్రీ.పూ. 2వేల నుంచి క్రీ.శ. తొలి వేయిసం.రాలలోనిది.
వేదకాలపు కుండల తయారీ:
వేదకాలపు నాగరికతకు రంగుపూతల కుండల సంస్కృతి, గాంధార సంస్కృతి. సమాధి సంస్కృతులను కొందరు పండితులు వేదకాలపు నాగరికత రూపొందడానికి కారకాలుగా భావించారు. విల్హెం రౌ తైత్తిరీయసంహిత, యజుర్వేదాలలో కుండల తయారీని పరిశీలించాడు. అతని అధ్యయనాలప్రకారం వేదకాలపు కుండలు చేతితో చేసినవి, రంగులు వేయనివి. కుజ్మిన పరిశీలనల ప్రకారం ఆసియామైనర్లో,మధ్యాసియాలో ఆండ్రోనోవో సంస్కృతికి సమానంగా వున్నాయి.
రంగుపూసిన కుండల సంస్కృతి(Ochre Couloured Pottery)
ఇది క్రీ.పూ. కంచుయుగంనాటి గంగా,సింధూమైదానానికి చెందినది. ఈ సంస్కృతి తూర్పు పంజాబు, ఈశాన్య రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లకు విస్తరించింది. ఇది ఇండో ఆర్యన్ లేదా వైదిక సంస్కృతి. రాజస్థాన్ లోని జోధ్ పురాలో సాహిబి నది, దాని ఉపనదులు కృష్ణావతి నది,సోతినది(ఆరావళి పర్వతాలనుంచి పుట్టి ప్రవహించేవి) దక్షిణం నుంచి ఈశాన్యంగా యమున వైపు ప్రవహించిపోతాయి. గంగామైదానాలకు ఈ సంస్కృతి క్రీ.పూ.2వేల సం.లలో చేరింది.ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియావారు రాగిగొడ్డండ్లను, కొన్ని కుండపెంకులను సహరాన్పూర్ తవ్వకాలలో కనుగొన్నారు. ఇక్కడ ఓసీపి సంస్కృతి విస్తారంగా వుంది. హరప్పా నాగరికతవలె ప్రత్యేకం.
రాగినిధుల సంస్కృతి:
క్రీ.పూ.2వేల సం.రాల కిందట వుందని చెప్పే ఈ సంస్కృతి భారతదేశ ఉత్తరభాగంలో గొప్పగానో, తక్కువగానో నిధులుగా దొరికింది. ఈ దోబ్ లో ఓసీపీ హరప్పా పూర్వ దశతో కలిసిన సంస్కృతి. నిధులుగా దొరికిన పనిముట్లు లోహయుగానికి చెందినవి. హర్యానా మ్యూజియంలో ఇవి భద్రపరిచివున్నాయి.
సమాధినిధుల సంస్కృతి:
ఇది ప్రాంతీయ కంచులోహయుగపు రూపం.పంజాబ్ ప్రాంతం, వాయవ్యభారతంలో క్రీ.పూ. 1900-1300 సం.లలో వున్నది. ఝూకర్, రంగ్పూర్ సంస్కృతులతో కలిసి వున్న సంస్కృతి. ఇండో ఆర్యన్ల తొలి వలసల దశలతో సంబంధం కలిగివున్నది.హరప్పాలో ఒక సమాధి బయటపడ్డది. కెనోయర్ ప్రకారం అక్కడ స్థిరపడ్డ ప్రజలలో వచ్చిన పరిణామాన్ని ప్రతిబింబించే సంస్కృతి. తొలిహరప్పా ప్రజల స్థిరజీవనానికి, నగర విధ్వంసం, అగమ్యుల దాడులు, ప్రదేశాల వదిలివేత యిట్లాంటివన్నీ ఈ సంస్కృతిలో అగుపిస్తాయి.
గాంధార సంస్కృతి:
దీనినే స్వాత్ సంస్కృతి అంటారు. క్రీ.పూ. 1500-500 సం.లలో వికసించింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో ఇండో ఆర్యన్ మాట్లాడేవారిలో ఇండో ఆర్యన్ వలసప్రజలలో వున్న సంస్కృతి. వేదకాలపు నాగరికత వికాసానికి ఇది బాగా తోడ్పడ్డది.
నలుపు,ఎరుపు పాత్రల సంస్కృతి:
Black and Red Ware Culture(BRW) ఉత్తర, మధ్య భారత ఉపఖండంలో వైదిక నాగరికతతో కలిసివున్న చివరి కంచులోహయుగానికి, ఇనుపయుగానికి చెందినది. పశ్చిమ గంగామైదానాలలో క్రీ.పూ.1450-1200 సం.ల కాలంలో బూడిదపూత పాత్రల సంస్కృతి(Painted Grey Ware Culture-PGW)మీద వచ్చినటువంటిది. మధ్య,తూర్పు గంగామైదానాలలో ఉ.ప్ర..బీహార్, బెంగాల్ లలో మధ్య భారతంలో బీఆర్డబ్ల్యూ కనిపిస్తుంది. ఈ సంస్కృతి క్రీ.పూ. 500 నుంచి క్రీ.శ. 700సం.ల వరకు కొనసాగింది. ఈ సంస్కృతిని అధిగమించింది Northern Black Polished Ware Culture.బీఆర్డబ్ల్యూ వ్యావసాయిక జీవనంతో ముడివడి వుంది. ఈ కాలంలో శంకులతో, రాగితో, టెర్రకోటలతో నగలు తయారు చేయబడ్డాయి. బీఆర్డబ్ల్యూ హరప్పా కుండలతో కలుస్తుంది. ఈ సంస్కృతి బూడిదరంగుపూత పాత్రలు, ఉత్తర భారతపు నలుపురంగు మెరుగుపాత్రల సంస్కృతుల మీద ప్రభావం చూపింది.
బూడిదరంగుపూత పాత్రలు:(Painted Grey Ware-PGW)
ఈ సంస్కృతి సోంఖ్, మథురలలో క్రీ.పూ. 1000-600 సం.లలో వుంది. పశ్చిమ గంగామైదానంలో ఘాగ్గర్ హక్రా లోయలోని ఇనుపయుగ సంస్కృతితో కలిసివుంది. మధ్యవైదిక, చివరివైదిక దశలకు సమకాలికమైనది. ఈప్రాంతంలో బీఆర్డబ్ల్యూ పిదప వచ్చిన సంస్కృతి.
ఉత్తరభారతపు నలుపుమెరుగు పాత్రలు:(Northern Black Polished Ware-NBP)
ఎన్బీపీ అని పిలువబడే ఈ పాత్రలు భారత ఉపఖండంలోని నగరాల ఇనుపయుగం నాగరికతలోనిది. క్రీ.పూ.700-200సం.ల నాటిది. పీజీడబ్ల్యు సంస్కృతిని, బీఆర్డబ్ల్యూ సంస్కృతిని దాటి క్రీ.పూ.500-300సం.లలో ఉచ్ఛదశలో వున్న చివరి వైదికయుగంలో 16 మహాజనపదాలలో, మౌర్యసామ్రాజ్యపు కాలంలో విలసిల్లింది.
ఎరుపు మెరుగుపాత్రలు:( Red Polished Ware- RPW)
గుజరాతులో విరివిగా,విస్తారంగా కనిపించే సంస్కృతి ఆర్పీడబ్ల్యు. కథియవార్ ప్రాంతంలో వంటపాత్రలు వంటివి క్రీ.పూ.1వ శతాబ్దం నాటివి. భారతదేశంలోని ఇతరప్రదేశాలలో బరోడా, తింబెర్వ, వాద్నగర్, వాలా, సూత్రపద, భండారియాలలో ఎన్నో శతాబ్దాలుగా వాడుకున్న పాత్రల సంస్కృతి. పండితులు ఈ కుండల్ని ఇండో రోమన్ వ్యాపారానికి గుర్తింపు చిహ్నంగా చెప్పారు.
ఈ పాత్రల్ని 1953లో బి.సుబ్బారావు గుర్తించాడు. తాను ‘ ఈ పాత్రలు రోమన్-సేమియన్ పాత్రలవంటి దిగుమతైన పాత్రలతో పోలివున్నావన్నాడు.
ఇందులో రెండురకాలపాత్రలుండేవి. ఒకటి స్థానికమైన వంటపాత్రలవంటివి. రెండవది విదేశీరకం వంటి నీరు చల్లే స్ప్రింక్లర్లు, పొడవైన మెడ పాత్రలు.ఇటువంటిపాత్రలు శ్రీలంకలోని తిస్స మహారామలోని మట్టిపొరల్లో లభించాయి.తొలినాళ్ళ ఆర్పీడబ్ల్యు తరుచుగా ఎన్బీపీడబ్ల్యు పాత్రలతో కలిసి లభించేవి.
మాల్వా సంస్కృతి:
ఇది పురావస్తు రాగియుగపు సంస్కృతి. మహారాష్ట్ర, దక్కన్ ద్వీపకల్పంలో విస్తరించింది. క్రీ.పూ. 1600-1300 సం.లలో వున్న ఈ సంస్కృతి క్రీ.పూ. 2000-1750 సం.లలోనే మొదలైవుంటుందని కార్బన్ డేటింగు వల్ల తెలుస్తున్నది.
జోర్వే సంస్కృతి:
ఇది పురావస్తు చాల్కోలిథిక్ సంస్కృతి. మహారాష్ట్ర, పశ్చిమ భారతం, నుంచి మ.ప్ర.లోని మాల్వా ప్రాంతాన్ని చేరుకున్నది. క్రీ.పూ. 1400 నుంచి 700 సం.ల వరకు వుందని చెప్పవచ్చు.
రంగమహల్ సంస్కృతి:
ఈ సంస్కృతి వైదికయుగానంతరమైనది. 124ప్రదేశాలలో శ్రీగంగానగర్, సూరత్ ఘర్, సికార్, అల్వార్, ఝుంఝున్ జిల్లాలలో ఘాగ్గర్ హక్రా నది వెంట విస్తరించింది. కుషానుల కాలం నుంచి గుప్తులకాలం వరకు వున్నది. స్వీడిష్ పరిశోధకులు రంగమహల్ వద్ద తవ్వకాలు జరిపారు. తొలినాళ్ళ గుప్తుల కాలానికి చెందిన టెర్రకోట వస్తువుల చాలా దొరికాయి. ఇక్కడ అందంగా చిత్రించిన పుష్పాలు, జంతువులు,పక్షుల డిజైన్లతో పాత్రలు లభించాయి.