‘చిత్రభారతం’ కవి చరిగొండ ధర్మన్న ఊరు మా చరిగొండః
చరికొండ గ్రామము పాత మహబూబ్ నగరం జిల్లా, కల్వకుర్తి తాలుకా, ఆమనగల్ మండలంలో వుండేది. ఇప్పుడది రంగారెడ్డి జిల్లా, కడ్తాల మండలానికి మార్చబడ్డది. గ్రామానికి ఉత్తరంగా మేడిపల్లి నక్కేర్త, తూర్పున కొలుకులపల్లి, దక్షిణాన నాగిళ్ళ, పడమర ముదివెన్ను గ్రామాలున్నాయి.
చరికొండలో అడివి దాదాపు 5వేలఎకరాలలో విస్తరించివుండేది. అడవిలో నీటివూటల కాలువలు,వూరి దగ్గర పారే కల్లెడ వాగు, గౌరమ్మ చెరువు చరికొండ నీటివనరులు. ఊరావల గుట్టల్లో నాగప్పచెరువు, పెరుమాండ్ల కుంట, కొత్తచెరువులు అదనపు నీటిసంపదలు. ఊరికి వ్యవసాయాధారాలు.
గ్రామంలో ఉత్తరదిశలో రుక్మిణీ,సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవాలయముంది. ఈ దేవాలయంలోని స్వామికి ప్రతిసంవత్సరం ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఇంకా ఈ గ్రామంలో గ్రామదేవతలు దుర్గమ్మ, పోచమ్మ, కోటమైసమ్మలకు గుడులు వున్నాయి.
గ్రామము చివర పాతకాలంనాటి మసీదు వుంది.
గ్రామానికి ఉత్తరదిశలో ఖిల్లాగుట్ట వుంది. గుట్టమీద కోట ఆనవాళ్ళున్నాయి. గుమ్మటాలు ప్రజలు పిలుచుకునే కట్టడాలు 4మిగిలివున్నాయి. ఈ కోటను రేచెర్ల పద్మనాయకులు కట్టించారని చరిత్ర. రాచకొండను, దేవరకొండను పాలించిన పద్మనాయకులే చరిగొండలో కోటను నిర్మింపజేసారు.
ద్వారము నుంచి కోట లోపలికి ప్రవేశించగానే పెద్దబావి అగుపిస్తుంది. ఆ బాయి వొడ్డున నిలబడి రాయి విసిరితే అవతి వొడ్డుకు పడదని స్థానికులు చెప్పకుంటారు. అంత పెద్ద బాయన్నమాట.
ఒక బండకింద వున్న బావిని ‘కన్నికల బావి’(కన్నెలబాయి?)అని పిలుస్తారు. బండకు కొందరు స్త్రీమూర్తుల శిల్పాలు చెక్కి వున్నాయి.
పెరుమాండ్లకుంట దగ్గర దేవాలయశిథిలాలు కనిపిస్తున్నాయి. అక్కడొక తలలేని నంది పడివుంది.
పద్మనాయక రాజు తవ్వించిందే చరిగొండలోని గౌరసముద్రం. రేచెర్ల పద్మనాయక రాజయిన రెండవ లింగమనీడు శాలివాహనశకము 1349, ప్లవంగనామ సంవత్సర, మార్గశిర పౌర్ణమినాడు అనగా క్రీ.శ. 1427 డిసెంబర్ 4వ తేదీన లింగమనీడు భార్య గౌరీదేవి పేరున ఈ చెరువు నిర్మాణము చేయించెనని చరిగొండ శాసనమువల్ల తెలుస్తున్నది. అంతేగాక ఆమె శ్రీశైల మల్లిఖార్జున స్వామికి, తిరుపతి వెంకటేశ్వరస్వామికి కానుకలు అర్పించిందట. భక్తులకు ధర్మసత్రాలను కట్టించినదట.
గౌరమ్మ చెరువు ఆవలి వొడ్డున పడమర దిక్కున ఒక దేవాలయమున్నది. వాటిని కృష్ణాపురము గుళ్ళు అంటారు
దుర్గమ్మగుడి ముందు నుంచి పొయ్యే గౌరమ్మచెరువు కాలువ గ్రామాన్ని రెండుగా చేసింది. కాలువకు దక్షిణాన చరికొండ పట్టి పడకలు, ఉత్తరాన చరికొండ పట్టి కల్వకుర్తి. వెనుకటి తూర్పుకోట, పడమటికోట అని ఇద్దరు మక్తేదార్ల నివాసాలు శిథిలస్థితిలో వున్నాయి.
కోనాపురం నుండి చరికొండకు వచ్చే తొవ్వలో రాకాసిగుళ్ళు, రాక్షసులబొందలు అని పిలువబడే మెగాలిథిక్ సమాధులున్నాయి.
చరిగొండ ధర్మన్న చిత్రభారత కావ్యం రాసిన కవి. చరిగొండవాడే. వరంగల్ నేలిన షితాబుఖానను సీతాపతి వద్ద మంత్రిగా పనిచేసిన ఎనమలూరి పెద్దనకు 8 ఆశ్వాసాల ప్రబంధ కావ్యాన్నంకితం చేసాడు చిత్రభారతకవి చరిగొండ ధర్మన్న. పెద్దన ధర్మపురికి చెందినవాడు. ధర్మన్న జీవితాకాలాన్ని ఆయన రచనలతో లెక్కించి క్రీ.శ. 1480 నుంచి 1530గా నిర్ణయించారు. ధర్మన్న ‘‘ శతలేఖిన్యవధాన పద్యరచనా సంధా సురత్రాణ చిహ్నితనామా, చరికొండ ధర్మసుకవీ’’ అని పిలువబడ్డాడు. చరిగొండ ధర్మన్న అవధానంలో ప్రవీణుడు. గంటకు వందపద్యాలు చెప్పగలవాడట.
మరొక ప్రతిభావంతుడైన కవి చరిగొండకే చెందిన హొన్నయ్య.ఈయన 17వ శతాబ్దంలో ‘జ్యోతిష్యరత్నాకరం’ రచించాడు. ప్రస్తుతమీ గ్రంథం లాస్ ఏంజెల్స్ గ్రంథాలయంలో వుందని ‘చరిగొండ చరిత్ర’ రాస్తున్న యారీదా రాధాకృష్ణా రావు గారు చెప్పారు.
రచనః శ్రీరామోజు హరగోపాల్,
కంటెంట్: వై.రాధాకృష్ణారావు, చరిగొండ
చరికొండ గ్రామము పాత మహబూబ్ నగరం జిల్లా, కల్వకుర్తి తాలుకా, ఆమనగల్ మండలంలో వుండేది. ఇప్పుడది రంగారెడ్డి జిల్లా, కడ్తాల మండలానికి మార్చబడ్డది. గ్రామానికి ఉత్తరంగా మేడిపల్లి నక్కేర్త, తూర్పున కొలుకులపల్లి, దక్షిణాన నాగిళ్ళ, పడమర ముదివెన్ను గ్రామాలున్నాయి.
చరికొండలో అడివి దాదాపు 5వేలఎకరాలలో విస్తరించివుండేది. అడవిలో నీటివూటల కాలువలు,వూరి దగ్గర పారే కల్లెడ వాగు, గౌరమ్మ చెరువు చరికొండ నీటివనరులు. ఊరావల గుట్టల్లో నాగప్పచెరువు, పెరుమాండ్ల కుంట, కొత్తచెరువులు అదనపు నీటిసంపదలు. ఊరికి వ్యవసాయాధారాలు.
గ్రామంలో ఉత్తరదిశలో రుక్మిణీ,సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవాలయముంది. ఈ దేవాలయంలోని స్వామికి ప్రతిసంవత్సరం ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఇంకా ఈ గ్రామంలో గ్రామదేవతలు దుర్గమ్మ, పోచమ్మ, కోటమైసమ్మలకు గుడులు వున్నాయి.
గ్రామము చివర పాతకాలంనాటి మసీదు వుంది.
గ్రామానికి ఉత్తరదిశలో ఖిల్లాగుట్ట వుంది. గుట్టమీద కోట ఆనవాళ్ళున్నాయి. గుమ్మటాలు ప్రజలు పిలుచుకునే కట్టడాలు 4మిగిలివున్నాయి. ఈ కోటను రేచెర్ల పద్మనాయకులు కట్టించారని చరిత్ర. రాచకొండను, దేవరకొండను పాలించిన పద్మనాయకులే చరిగొండలో కోటను నిర్మింపజేసారు.
ద్వారము నుంచి కోట లోపలికి ప్రవేశించగానే పెద్దబావి అగుపిస్తుంది. ఆ బాయి వొడ్డున నిలబడి రాయి విసిరితే అవతి వొడ్డుకు పడదని స్థానికులు చెప్పకుంటారు. అంత పెద్ద బాయన్నమాట.
ఒక బండకింద వున్న బావిని ‘కన్నికల బావి’(కన్నెలబాయి?)అని పిలుస్తారు. బండకు కొందరు స్త్రీమూర్తుల శిల్పాలు చెక్కి వున్నాయి.
పెరుమాండ్లకుంట దగ్గర దేవాలయశిథిలాలు కనిపిస్తున్నాయి. అక్కడొక తలలేని నంది పడివుంది.
పద్మనాయక రాజు తవ్వించిందే చరిగొండలోని గౌరసముద్రం. రేచెర్ల పద్మనాయక రాజయిన రెండవ లింగమనీడు శాలివాహనశకము 1349, ప్లవంగనామ సంవత్సర, మార్గశిర పౌర్ణమినాడు అనగా క్రీ.శ. 1427 డిసెంబర్ 4వ తేదీన లింగమనీడు భార్య గౌరీదేవి పేరున ఈ చెరువు నిర్మాణము చేయించెనని చరిగొండ శాసనమువల్ల తెలుస్తున్నది. అంతేగాక ఆమె శ్రీశైల మల్లిఖార్జున స్వామికి, తిరుపతి వెంకటేశ్వరస్వామికి కానుకలు అర్పించిందట. భక్తులకు ధర్మసత్రాలను కట్టించినదట.
గౌరమ్మ చెరువు ఆవలి వొడ్డున పడమర దిక్కున ఒక దేవాలయమున్నది. వాటిని కృష్ణాపురము గుళ్ళు అంటారు
దుర్గమ్మగుడి ముందు నుంచి పొయ్యే గౌరమ్మచెరువు కాలువ గ్రామాన్ని రెండుగా చేసింది. కాలువకు దక్షిణాన చరికొండ పట్టి పడకలు, ఉత్తరాన చరికొండ పట్టి కల్వకుర్తి. వెనుకటి తూర్పుకోట, పడమటికోట అని ఇద్దరు మక్తేదార్ల నివాసాలు శిథిలస్థితిలో వున్నాయి.
కోనాపురం నుండి చరికొండకు వచ్చే తొవ్వలో రాకాసిగుళ్ళు, రాక్షసులబొందలు అని పిలువబడే మెగాలిథిక్ సమాధులున్నాయి.
చరిగొండ ధర్మన్న చిత్రభారత కావ్యం రాసిన కవి. చరిగొండవాడే. వరంగల్ నేలిన షితాబుఖానను సీతాపతి వద్ద మంత్రిగా పనిచేసిన ఎనమలూరి పెద్దనకు 8 ఆశ్వాసాల ప్రబంధ కావ్యాన్నంకితం చేసాడు చిత్రభారతకవి చరిగొండ ధర్మన్న. పెద్దన ధర్మపురికి చెందినవాడు. ధర్మన్న జీవితాకాలాన్ని ఆయన రచనలతో లెక్కించి క్రీ.శ. 1480 నుంచి 1530గా నిర్ణయించారు. ధర్మన్న ‘‘ శతలేఖిన్యవధాన పద్యరచనా సంధా సురత్రాణ చిహ్నితనామా, చరికొండ ధర్మసుకవీ’’ అని పిలువబడ్డాడు. చరిగొండ ధర్మన్న అవధానంలో ప్రవీణుడు. గంటకు వందపద్యాలు చెప్పగలవాడట.
మరొక ప్రతిభావంతుడైన కవి చరిగొండకే చెందిన హొన్నయ్య.ఈయన 17వ శతాబ్దంలో ‘జ్యోతిష్యరత్నాకరం’ రచించాడు. ప్రస్తుతమీ గ్రంథం లాస్ ఏంజెల్స్ గ్రంథాలయంలో వుందని ‘చరిగొండ చరిత్ర’ రాస్తున్న యారీదా రాధాకృష్ణా రావు గారు చెప్పారు.
రచనః శ్రీరామోజు హరగోపాల్,
కంటెంట్: వై.రాధాకృష్ణారావు, చరిగొండ















No comments:
Post a Comment