పరడలో బౌద్ధ నాగ ముచుళింద శిల్పం:
నిన్నటిరోజు 19.06.2018న తెలంగాణజాగృతి ఆధ్వర్యంలో చారిత్రకపరిశోధనలు చేస్తున్న చరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, రాగి మురళి, సూరారం రాంప్రసాద్, చంటిల సందర్శనలో పరడలో ‘‘నాగముచుళింద’’ విగ్రహం లభించింది. బుద్ధుడికి జ్ఞానోదయమైన పిదప తనను ప్రాకృతికతత్వాలనుంచి కాపాడింది నాగరూపియైన ముచుళిందుడు. బోధివృక్షం నీడలో తపస్సుచేస్తున్న బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినపుడు 7రోజులపాటు స్వర్గాలు చీకటైపోయాయట. తెంపులేని వర్షం కురిసింది. నాగరాజైన ముచుళించుడు పాతాళం నుంచి వచ్చి తనపడగనీడలో బుద్ధుని కాపాడట. ముచుళింద సుత్తలో ఉరువేలాలోని నేరంజరా నది ఒడ్డున ముచులింద చెట్టు కింద బుద్ధునికి జ్ఞానోదయమైనట్టు చెప్పబడింది.
పరడ గ్రామం వెలుపల వున్న శివునిగుట్టకు ఉత్తరం అంచున మట్టిదిబ్బవుంది. అక్కడ సాతవాహనకాలంనాటి ఇటుకలతో కట్టిన వలయాకారపు కట్టడం కనిపిస్తున్నది. అది జారిపోకుండా రాళ్ళతో కట్టిన అంచు వుంది. అక్కడ నిధులవేటగాళ్ళు తవ్విపారేసిన గుంతలున్నాయి. చెట్లు పెరిగిపోయాయి. ఒక చెట్టు మొదట భద్రపరిచిన 8 అంగుళాలు ఎత్తు, 5 అంగుళాల వెడల్పున్న బలపపురాతిబిళ్ళ మీద చెక్కిన నాగముచుళింద శిల్పం కనిపించింది. దాదాపు సంవత్సరం కిందే బయటపడిందని గ్రామస్తులంటున్నారు. ఈ పూజావిగ్రహం అడుగున రెండువరుసలో 5,6 వ శతాబ్దాల తెలుగులిపిలో లఘుశాసనం వుంది. ‘‘స్వస్తిశ్రి మనుమథ సంసర’’ తప్ప మిగతా కొన్ని అక్షరాలు చదువడానికి అనువుగా స్పష్టంగా లేవు. నాగముచుళింద విగ్రహం లభించడం, వృత్తాకారపు ఇటుకల నిర్మాణం, డంగు సున్నం వాడిన ఆనవాళ్ళు ఇవి బౌద్ధస్తూపం వుండవచ్చన్న సందేహానికి తావిస్తున్నాయి.
పరడలో గ్రామానికి వాయవ్యంగా వున్న చిన్నబోడగుట్టను శివునిగుట్ట అని పిలుస్తారు గ్రామస్తులు.దాని మీద ప్రాచీన శివాలయం వుంది. ఒక కోనేరు వుంది. ఈ గుట్ట మీద పురామానవుని ఆనవాళ్ళు అగుపిస్తున్నాయి. ఒక డోల్మన్, రాతిపరికరాల నూరుకున్న గుంతలు, వడిసెలరాళ్ళున్నాయి. రాతిగొడ్డండ్లు దొరికినాయని గ్రామస్తులు చెప్పారు. గుట్టచుట్టు వందల బంతిరాళ్ళ రాకాసిగుళ్ళుండేవట.పొలాలు చేయడం వల్ల అవన్నీ తొలగించబడ్డాయి. గ్రామానికి రెండువైపుల పాటిగడ్డలున్నాయి.పదులకొద్ది ఎకరాల్లో వున్న ఉత్తరపు పాటిగడ్డలో చరిత్రపూర్వయుగపు కుండపెంకులు, తొలిచారిత్రకకాలపు కుండపెంకులు విరివిగా లభిస్తున్నాయి. మట్టిపూసలలెన్నో దొరికినాయని అక్కడి రైతులు చెప్పారు. మాకు ఆ పొలాల్లో ఒక ‘లాపిస్ లాజులె’ (ఇంద్రనీలపురంగు) పూస దొరికింది. దీన్నిబట్టి ఈ ప్రదేశం చరిత్రపూర్వయుగపు కాలం నుంచి కొత్తరాతియుగం తొలిదశనుంచి ఇక్కడ మానవావాసాలున్నాయని, నాగరికతావికాసం జరిగిందని చెప్పవచ్చు.
తూర్పు పాటిగడ్డలో లభిస్తున్న కుండపెంకులు చారిత్రక మధ్యయుగాల నాటివి. అక్కడ పురాతన దాసాంజనేయుని ఆలయం వద్ద లభించిన దానశాసనం( నల్లగొండ శాసనసంపుటి, సంపుటం-1లో 129పేజిలోని శాసన సంఖ్య.48) క్రీ.శ. 1144లో కళ్యాణీ చాళుక్యచక్రవర్తి జగదేకమల్ల ప్రతాపచక్రవర్తి వేయించినది. శాసనంలో గ్రామం పేరు పరండ.
గొప్ప నాగరికతా సంస్కృతులకు నిలయమైన శివునిగుట్ట క్వారీపనులతో ధ్వంసమౌతున్నది. ప్రస్తుతం పుట్ట రాజిరెడ్డి, మందడి కొండలరెడ్డి, పుట్ట జైపాల్ రెడ్డి, లోకసాని రాంరెడ్డి మొదలైన గ్రామప్రజల వినతిమేరకు ఎండోమెంట్ నోటీసుతో తాత్కాలికంగా క్వారీపనులు ఆగినా ఇప్పటికే సగానికి ఎక్కువగా తొలిచేసిన గుట్ట పూర్తిగా నిర్మూలనం అవుతుందని గ్రామస్తులు భయపడుతున్నారు.
నిన్నటిరోజు 19.06.2018న తెలంగాణజాగృతి ఆధ్వర్యంలో చారిత్రకపరిశోధనలు చేస్తున్న చరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, రాగి మురళి, సూరారం రాంప్రసాద్, చంటిల సందర్శనలో పరడలో ‘‘నాగముచుళింద’’ విగ్రహం లభించింది. బుద్ధుడికి జ్ఞానోదయమైన పిదప తనను ప్రాకృతికతత్వాలనుంచి కాపాడింది నాగరూపియైన ముచుళిందుడు. బోధివృక్షం నీడలో తపస్సుచేస్తున్న బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినపుడు 7రోజులపాటు స్వర్గాలు చీకటైపోయాయట. తెంపులేని వర్షం కురిసింది. నాగరాజైన ముచుళించుడు పాతాళం నుంచి వచ్చి తనపడగనీడలో బుద్ధుని కాపాడట. ముచుళింద సుత్తలో ఉరువేలాలోని నేరంజరా నది ఒడ్డున ముచులింద చెట్టు కింద బుద్ధునికి జ్ఞానోదయమైనట్టు చెప్పబడింది.
పరడ గ్రామం వెలుపల వున్న శివునిగుట్టకు ఉత్తరం అంచున మట్టిదిబ్బవుంది. అక్కడ సాతవాహనకాలంనాటి ఇటుకలతో కట్టిన వలయాకారపు కట్టడం కనిపిస్తున్నది. అది జారిపోకుండా రాళ్ళతో కట్టిన అంచు వుంది. అక్కడ నిధులవేటగాళ్ళు తవ్విపారేసిన గుంతలున్నాయి. చెట్లు పెరిగిపోయాయి. ఒక చెట్టు మొదట భద్రపరిచిన 8 అంగుళాలు ఎత్తు, 5 అంగుళాల వెడల్పున్న బలపపురాతిబిళ్ళ మీద చెక్కిన నాగముచుళింద శిల్పం కనిపించింది. దాదాపు సంవత్సరం కిందే బయటపడిందని గ్రామస్తులంటున్నారు. ఈ పూజావిగ్రహం అడుగున రెండువరుసలో 5,6 వ శతాబ్దాల తెలుగులిపిలో లఘుశాసనం వుంది. ‘‘స్వస్తిశ్రి మనుమథ సంసర’’ తప్ప మిగతా కొన్ని అక్షరాలు చదువడానికి అనువుగా స్పష్టంగా లేవు. నాగముచుళింద విగ్రహం లభించడం, వృత్తాకారపు ఇటుకల నిర్మాణం, డంగు సున్నం వాడిన ఆనవాళ్ళు ఇవి బౌద్ధస్తూపం వుండవచ్చన్న సందేహానికి తావిస్తున్నాయి.
పరడలో గ్రామానికి వాయవ్యంగా వున్న చిన్నబోడగుట్టను శివునిగుట్ట అని పిలుస్తారు గ్రామస్తులు.దాని మీద ప్రాచీన శివాలయం వుంది. ఒక కోనేరు వుంది. ఈ గుట్ట మీద పురామానవుని ఆనవాళ్ళు అగుపిస్తున్నాయి. ఒక డోల్మన్, రాతిపరికరాల నూరుకున్న గుంతలు, వడిసెలరాళ్ళున్నాయి. రాతిగొడ్డండ్లు దొరికినాయని గ్రామస్తులు చెప్పారు. గుట్టచుట్టు వందల బంతిరాళ్ళ రాకాసిగుళ్ళుండేవట.పొలాలు చేయడం వల్ల అవన్నీ తొలగించబడ్డాయి. గ్రామానికి రెండువైపుల పాటిగడ్డలున్నాయి.పదులకొద్ది ఎకరాల్లో వున్న ఉత్తరపు పాటిగడ్డలో చరిత్రపూర్వయుగపు కుండపెంకులు, తొలిచారిత్రకకాలపు కుండపెంకులు విరివిగా లభిస్తున్నాయి. మట్టిపూసలలెన్నో దొరికినాయని అక్కడి రైతులు చెప్పారు. మాకు ఆ పొలాల్లో ఒక ‘లాపిస్ లాజులె’ (ఇంద్రనీలపురంగు) పూస దొరికింది. దీన్నిబట్టి ఈ ప్రదేశం చరిత్రపూర్వయుగపు కాలం నుంచి కొత్తరాతియుగం తొలిదశనుంచి ఇక్కడ మానవావాసాలున్నాయని, నాగరికతావికాసం జరిగిందని చెప్పవచ్చు.
తూర్పు పాటిగడ్డలో లభిస్తున్న కుండపెంకులు చారిత్రక మధ్యయుగాల నాటివి. అక్కడ పురాతన దాసాంజనేయుని ఆలయం వద్ద లభించిన దానశాసనం( నల్లగొండ శాసనసంపుటి, సంపుటం-1లో 129పేజిలోని శాసన సంఖ్య.48) క్రీ.శ. 1144లో కళ్యాణీ చాళుక్యచక్రవర్తి జగదేకమల్ల ప్రతాపచక్రవర్తి వేయించినది. శాసనంలో గ్రామం పేరు పరండ.
గొప్ప నాగరికతా సంస్కృతులకు నిలయమైన శివునిగుట్ట క్వారీపనులతో ధ్వంసమౌతున్నది. ప్రస్తుతం పుట్ట రాజిరెడ్డి, మందడి కొండలరెడ్డి, పుట్ట జైపాల్ రెడ్డి, లోకసాని రాంరెడ్డి మొదలైన గ్రామప్రజల వినతిమేరకు ఎండోమెంట్ నోటీసుతో తాత్కాలికంగా క్వారీపనులు ఆగినా ఇప్పటికే సగానికి ఎక్కువగా తొలిచేసిన గుట్ట పూర్తిగా నిర్మూలనం అవుతుందని గ్రామస్తులు భయపడుతున్నారు.
No comments:
Post a Comment